జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ.కోటి పట్టుబడింది. కారులో తరలిస్తున్న రూ.1.06 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధిర మిరప రైతులకు చెల్లించాల్సిన పంట డబ్బుగా ఆ వ్యాపారి వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
