శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని నూజివీడు మండలంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మండలంలోని సిద్దార్థనగరం, ఓగిరాలతండాల్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా అనుమానంగా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో సారా తయారీకి ఉపయోగించే 2వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 30 లీటర్ల నాటుసారా, 25 కేజీల నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
