నకిలీ ఐపీఎస్ అధికారి శ్రుతి సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి రూ. 11కోట్లు శ్రుతి సిన్హా వసూలు చేసినట్లు చెబుతున్నారు. బంధువు విజయ్కుమార్రెడ్డితో కలిసి శృతి సిన్హా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. నెల రోజుల క్రితం ఏపీలో విజయ్కుమార్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. వసూలు చేసిన డబ్బుతో శృతి సిన్హా ఖరీదైన కార్లను కొనుగోలు చేసిందని పోలీసులు చెబుతున్నారు. తన చెల్లితో వీరారెడ్డి సోదరుడికి వివాహం శ్రుతి జరిపిస్తాని చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు. శృతి సిన్హా నుంచి 3 కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
