నాగపూర్ లాడ్జి ఘటనలో నిందితురాలైన ప్రియురాలి అరెస్ట్

0
160
Spread the love

నాగపూర్ (మహారాష్ట్ర): లైంగిక చర్య సందర్భంగా లాడ్జి గదిలో ఊపిరి ఆడక పురుషుడు మరణించిన ఘటనలో నిందితురాలైన ప్రియురాలిని నాగపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేర నాగపూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి ప్రియురాలిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ప్రియురాలిని జనవరి 13వతేదీ వరకు రిమాండుకు తరలిస్తూ కోర్టు జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలోని ఖాపర్ ఖేడ్ ప్రాంతానికి చెందిన ఓ పురుషుడు మహిళతో గడిపేందుకు లాడ్జిలో ఓ గదిని బుక్ చేసుకున్నాడు.

ఒక పోర్ను క్లిప్ చూసిన తర్వాత మహిళ పురుషుడి మెడను తాడుతో కుర్చీకి కట్టింది. అనంతరం లైంగిక చర్య సందర్భంగా తన చేతులు, కాళ్లను కుర్చీకి కట్టుకుంది. లైంగిక చర్య సాగిస్తూ మహిళ వాష్ రూంకు వెళ్లింది. పురుషుడు కూర్చున్న కుర్చీ జారి పడి అతని మెడకు కట్టి ఉన్న తాడు బిగుసుకుంది. దీంతో పురుషుడు ఊపిరి ఆడక మరణించాడు. వాష్ రూం నుంచి మహిళ తిరిగి వచ్చి చూస్తే తన భాగస్వామి కదలకుండా పడి ఉన్నాడు. దీంతో మహిళ వెంటనే హోటల్ మేనేజరుకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పురుషుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here