Homeతెలంగాణక్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక భార్యాభర్తలు ‘ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్టేషన్ పరిధిలో ఈ విషాధ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కీసర గ్రామానికి చెందిన సురేశ్ కుమార్‌కు భార్య భాగ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల అప్పుల భారం ఎక్కువ కావడంతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలను బంధువుల ఇంటికి పంపించి శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో వారి పిల్లలు అనాధలుగా మిగిలిపోవడం స్థానికులను కంటతడిపెట్టించింది.

RELATED ARTICLES

Most Popular